ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..16 మంది మృతి

యూపీలోని షాజహన్ పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంకా క్రాసింగ్‌ వద్ద  ట్రక్కు అదుపు తప్పి రెండు టెంపోలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. గాయపడిన వారికి వైద్యం అందించాలని, తగిన పరిహారం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.