ఆఫ్ఘనిస్తాన్ మదర్సాలో బాంబు పేలుడు.. 16 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్ మదర్సాలో బాంబు పేలుడు.. 16 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్​ లోని ఐబక్​ నగరంలో ఉన్న ఒక మదర్సాలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మృతిచెందగా, 24 మందికి గాయాలయ్యాయి. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువమంది పిల్లలు, సామాన్య ప్రజలే ఉన్నట్లు తెలుస్తోంది. తాలిబన్​ ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి ఈ దాడి ఘటనను ధ్రువీకరించారు. అయితే మృతుల సంఖ్యపై స్పష్టమైన ప్రకటన చేయలేదు.

దాడికి బాధ్యులను గుర్తించే పనిలోనే ఉన్నామని ఆఫ్ఘనిస్తాన్​ హోంశాఖ అధికార ప్రతినిధి అబ్దుల్​ నాఫయ్​ టాకోర్​ తెలిపారు. మృతుల సంఖ్యను తగ్గించిచూపే ప్రయత్నంలో భాగంగా.. కేవలం 10 మందే చనిపోయారని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడికి బాధ్యులమని ప్రకటించుకోలేదు.