దుబాయ్ గజగజలాడింది : 20 నిమిషాల్లో 7 పేలుళ్లు.. ఇరాన్ దాడి చేసిందా లేక..!

దుబాయ్ గజగజలాడింది : 20 నిమిషాల్లో 7 పేలుళ్లు.. ఇరాన్ దాడి చేసిందా లేక..!

దుబాయ్ గజగజలాడింది. వణికిపోయింది. 2026, ఆగస్ట్ 5వ తేదీ ఉదయం ఈ పేలుళ్లు జరిగినట్లు చెబుతోంది దుబాయ్ ప్రభుత్వం. జెబెల్ అలీ ఇండస్ట్రీయల్ ప్రాంతంలో జరిగిన ఈ పేలుళ్ల వెనక ఇరాన్ దాడి చేసిందా లేక.. మరో కారణం ఏమైనా ఉందా అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు దుబాయ్. పేలుళ్ల తర్వాత జెబెల్ అలీ ఇండస్ట్రీయల్ ఏరియాలోని ఆకాశంలో దట్టమైన పొగలు కమ్మేశాయి. మంటలు ఎగసిపడ్డాయి. ఈ పేలుళ్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.......


దుబాయ్‌లోని జెబెల్ అలీ ఇండస్ట్రియల్ ఏరియాలో  కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే కనీసం 7 సార్లు పేలుళ్లు వినిపించాయని ఇరాన్‌కు చెందిన 'మెహర్' వార్తా సంస్థ తెలిపింది. దీనికి సంబంధించి ఆకాశంలో దట్టమైన పొగ అలుముకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ పేలుళ్లు ఎందుకు జరిగాయి అనేదానిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది పారిశ్రామిక ప్రమాదమా లేక శత్రువుల దాడా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగిందా లేదా ఆస్తీ నష్టం ఎంత అనే వివరాలు ఇంకా తెలియరాలేదు.

 

ఈ పేలుళ్లకు సంబంధించిన వీడియోలు తీశారనే ఆరోపణలతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

క్షిపణి దాడి ప్రచారం:
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నడుస్తున్న తరుణంలో... యెమెన్ నుంచి యూఏఈ (UAE) పై  మిస్సైల్  దాడి జరిగి ఉండవచ్చని కొన్ని ఇరాకీ వార్తా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. అయితే, అధికారికంగా యూఏఈ మీడియా దీనిని ధృవీకరించలేదు. ఈ పేలుళ్లకు, క్షిపణి దాడికి సంబంధం ఉందా లేదా అనే దానిపై స్పష్టత లేదు.