- 17 కిలోల సరుకు సీజ్
పద్మారావునగర్, వెలుగు: ఒడిశా నుంచి గుజరాత్కు రైళ్లలో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను సికింద్రాబాద్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు కలిసి పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 8.95 లక్షల విలువైన 17.909 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే డీఎస్సీ జావేద్, ఇన్స్పెక్టర్లు సాయి ఈశ్వర్గౌడ్, సారస్వత్ ఈ కేసు వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఒడిశాకు చెందిన దీపక్ స్వైన్ (24)తో పాటు ఓ 16 ఏళ్ల మైనర్ బాలుడు సూరత్లో నివసిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వీరిద్దరికీ రాజేశ్ కుమార్ అనే స్మగ్లర్ ఒక్కో ప్యాకెట్కు రూ. 7 వేలు ఇస్తానని ఆశ చూపాడు.
దీంతో వారు ఈ నెల 7న ఒడిశాలోని ఫుల్బాని అటవీ ప్రాంతంలో గంజాయి తీసుకుని విశాఖ ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ చేరుకున్నారు. స్టేషన్ లోని జనరల్ వెయిటింగ్ హాల్లో సూరత్ రైలు కోసం వేచి చూస్తుండగా, తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి వారి లగేజీని సోదా చేశారు. రెండు ట్రాలీ సూట్కేసుల్లో దాచిన 9 గంజాయి ప్యాకెట్లు బయటపడటంతో ఇద్దరిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
