యార్కర్ చూసి ఫిదా..లంక పేసర్‌‌‌‌కు ధోనీ పిలుపు

యార్కర్ చూసి ఫిదా..లంక పేసర్‌‌‌‌కు ధోనీ పిలుపు

చెన్నై : శ్రీలంకకు చెందిన ఓ కాలేజ్ క్రికెటర్‌‌‌‌కు మహేంద్ర సింగ్ ధోనీ బంపరాఫర్ ఇచ్చాడు. అతను వేసిన ఓ అద్భుత యార్కర్‌‌ను సోషల్ మీడియాలో చూసి ఇంప్రెస్ అయిన మహీ ‌‌సీఎస్‌‌కే నెట్‌‌ బౌలర్‌‌‌‌గా చాన్స్  ఇచ్చాడు. ఆ క్రికెటర్ పేరు కుగదాస్ మతులన్‌‌. శ్రీలంకలోని జాఫ్నా సిటీకి చెందిన 17 ఏండ్ల ఈ పేసర్  కొన్ని రోజుల కిందట  సెయింట్ జాన్స్‌‌ కాలేజ్‌‌

జాఫ్నా సెంట్రల్ కాలేజ్‌‌ మధ్య జరిగిన మ్యాచ్‌‌లో వేసిన ఓ పదునైన ఇన్‌‌ స్వింగింగ్‌‌ యార్కర్‌‌ను ఎదుర్కోలేక బ్యాటర్ క్రీజులో కిందపడ్డాడు. వికెట్లు ఎగిరి అవతల పడ్డాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌ అయింది.  దాంతో జాఫ్నా స్లింగాగా పేరుతెచ్చుకున్న కుగదాస్‌‌ బౌలింగ్‌‌ను

దగ్గరి నుంచి గమనించాలని అనుకున్న ధోనీ ఈ ఐపీఎల్‌‌లో సీఎస్‌‌కే నెట్స్‌‌లో బౌలింగ్‌‌ చేసేందుకు అతడిని చెన్నైకి పిలిపించాడు. కాగా, కుగదాస్ బౌలింగ్‌‌ లంక లెజెండరీ పేసర్ లసిత్ మలింగ బౌలింగ్‌‌ను పోలి ఉండటం గమనార్హం.