హైదరాబాద్, వెలుగు : సిటీలో కరోనా వైరస్స్పీడ్గా స్ప్రెడ్ అవుతోంది. లాక్డౌన్రిలాక్సేషన్స్తో అన్ని ఏరియాలకూ వ్యాపించగా, ఖైరతాబాద్ జోన్లో ఎక్కువ కేసులు ఉంటున్నాయి. డైలీ వస్తున్న పాజిటివ్స్లో 70 శాతం ఇక్కడివే. ముఖ్యంగా జియాగూడ ఏరియాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇతర ప్రాంతాల్లో నమోదవుతున్న కేసుల్లోనూ ఇక్కడి లింకులు బయటపడుతున్నాయి. కరోనాకు కేరాఫ్గా మారిన ఖైరతాబాద్జోన్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ల సెర్చింగ్అధికారులకు తలనొప్పిగా మారింది. మార్చిలో కేసులు ఎక్కువగా చార్మినార్జోన్లో నమోదయ్యాయి. మర్కజ్వెళ్లొచ్చిన వ్యక్తులు, ఫ్యామిలీస్కే పాజిటివ్ వచ్చింది. ఈ జోన్లో మార్చి నుంచి మే నెలాఖరు వరకు 520 వరకు నమోదైతే, ఖైరతాబాద్జోన్లో 250దాకా కేసులున్నాయి. కేవలం 20 రోజుల్లోనే 180 పాజిటివ్లు వచ్చాయి. జియాగూడలోని దుర్గానగర్, సాయిదుర్గానగర్, వెంకటేశ్వర నగర్, సబ్జీమండి, గుడిమల్కాపూర్, లంగర్హౌస్పరిధిలోనే 90శాతం కేసులున్నాయి. 115 కంటెయిన్మెంట్జోన్లు ఏర్పాటు చేశారు.
ప్రైమరీ కాంటాక్ట్లే..
చార్మినార్జోన్లో సగటున డైలీ 8 నుంచి 10 కేసులు వస్తున్నాయి. అవన్నీ ప్రైమరీ కాంటాక్ట్లే. ఈ జోన్పరిధిలో 120 దాకా యాక్టివ్కేసులున్నాయి. 80 కంటెయిన్మెంట్జోన్లు, హోమ్కంటెయిన్మెంట్లను ఏర్పాటుచేశారు. వాటికి సంబంధించి చాలామందికి కరోనా ఎలా సోకిందనే లింక్కూడా తెలియకపోవడం అధికారులకు సవాల్గా మారింది. ప్రస్తుతం ప్రైమరీ కాంటాక్ట్లతోనే వైరస్వ్యాప్తిని గుర్తిస్తున్నట్టు స్థానిక అధికారులు చెప్పారు. జియాగూడ నుంచి వైరస్వ్యాప్తి చెందిన సమయంలోనే లాక్డౌన్సడలింపులు ఇవ్వడంతో కమ్యూనిటీ స్ప్రెడ్అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.