ఎంపీ టికెట్ల కోసం కాంగ్రెస్లో క్యూ

ఎంపీ టికెట్ల కోసం కాంగ్రెస్లో క్యూ
  • డీసీసీల ద్వారా ఇప్పటి వరకు 187 దరఖాస్తులు
  • జనరల్ సీట్లకు రూ. 50 వేలు, రిజర్వ్డ్  సీట్లకు రూ. 25 వేల రుసుము
  • పిబ్రవరి మూడో తేదీ వరకు అప్లికేషన్లకు అవకాశం

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల  నేపథ్యంలో ఆశావహుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. జనరల్ సీట్లకురూ. 50 వేలు, రిజర్వ్డ్ సీట్లకు రూ. 25 వేల చొప్పున దరఖాస్తు రుసుముగా నిర్ణయించింది. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలుండగా.. ఇప్పటి వరకు డీసీసీలకు 187 దరఖాస్తులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫార్మాట్ ను గాంధీభవన్ ఇవాళ విడుదల చేసింది. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే దరఖాస్తులు స్వీకరించింది కాంగ్రెస్ పార్టీ. 119 సెగ్మెంట్లకు దరఖాస్తులను ఆహ్వానించగా వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అవలంబిస్తోంది. ఫిబ్రవరి మూడో తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉంది. ఒక్కో సెగ్మెంట్ నుంచి భారీ సంఖ్యలో పోటీ ఉన్నట్టు తెలుస్తోంది.