ముంబైలో భారీ వర్షాలకు పాత భవనాలు కూలి ఏడుగురు మృతి

ముంబైలో భారీ వర్షాలకు పాత భవనాలు కూలి ఏడుగురు మృతి

భారీ వర్షాలు, వరదలు మహారాష్ట్ర రాజధాని ముంబైని ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ముంబైలోని రెండు పాత భవనాలు కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో  ఏడుగురు చనిపోయారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు,  రెస్క్యూ టీం సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగించి మృతదేహాలను వెలికి తీశారు. గాయాపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంలో చనిపోయిన మృతులకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.