పట్టాలు తప్పిన రెండు కోచ్ లు.. సహాయక చర్యలు ముమ్మరం

పట్టాలు తప్పిన రెండు కోచ్ లు.. సహాయక చర్యలు ముమ్మరం

రాజస్థాన్‌లోని కోటాలో జనవరి 5న సాయంత్రం భోపాల్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికైతే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కానట్టు తెలుస్తోంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రైలు నంబర్ 14813, జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్ రెండు కోచ్‌లు కోట జంక్షన్‌లోని యార్డులో పట్టాలు తప్పాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కోటా డివిజన్‌లోని డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) ప్రయాణికుల కోసం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌లను కూడా విడుదల చేశారు.

అత్యవసర సంప్రదింపు నంబర్‌లు

    0744-2467171
    0744-2467172
    9001017097
    9414018692
    9887143093

అంతకుముందు డిసెంబర్ 2023లో రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో ఖాళీ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ సంఘటన బికనీర్‌లోని లాల్‌ఘర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది.