కశ్మీర్లో కాల్పులు..ఇద్దరు తీవ్రవాదులు హతం

కశ్మీర్లో కాల్పులు..ఇద్దరు తీవ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య  జరిగన ఎదురు కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లాలోని ఓ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో తెల్లవారుజాము నుంచి ఆర్మీ, CRPF, జమ్మూకశ్మీర్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో… ఎన్ కౌంటర్ మొదలు పెట్టారు జవాన్లు. మృతి చెందిన తీవ్రవాదులు ఏ సంస్థకు చెందిన వారనేది ఇంకా ప్రకటించలేదు.