జమ్మూలో ఎన్ కౌంటర్ .. లష్కరే టెర్రరిస్టు హతం

జమ్మూలో ఎన్ కౌంటర్ .. లష్కరే టెర్రరిస్టు హతం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​లోని కుల్గాం జిల్లాలో మంగళవారం ఎన్​కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పు ల్లో లష్కరే తాయిబా(ఎల్ఈటీ) టాప్ కమాండర్​తో పాటు ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. చనిపోయిన వారి లో ఒకరు లష్కరే తాయిబాకు చెందిన బాసిత్ దార్​గా గుర్తించిన ట్లు పోలీసులు తెలిపారు. రెడ్వాణి గ్రామంలో టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారంతో సోమవారం రాత్రి భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ప్రారంభించారు. 

లొంగిపోవాలని సూచించినా టెర్రరిస్టులు వినిపిం చుకోకుండా కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతాదళాలు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారు.