పిడుగు పాటు, వర్షాల కారణంగా మొత్తం 20 మంది మృతి

పిడుగు పాటు, వర్షాల కారణంగా మొత్తం 20 మంది మృతి

లాహోర్ : పాకిస్తాన్​లోని పంజాబ్ ప్రావిన్స్​లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పిడుగు పాటు, వర్షాల కారణంగా మొత్తం 20 మంది చనిపోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఆదివారం నుంచి గ్యాప్ లేకుండా వాన పడ్తున్నది. జూన్ 30 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని పాకిస్తాన్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. పంజాబ్ ప్రావిన్స్​లోని నరోవల్, షేఖ్​పురా, నన్‌‌‌‌‌‌‌‌కానా సాహిబ్ నగరాల్లో పిడుగుపాటుకు 8 మంది చనిపోయారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు.

నరోవల్‌‌‌‌‌‌‌‌లో భారీ వర్షం కారణంగా ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ సమాధి అయ్యారు. లాహోర్, షేక్‌‌‌‌‌‌‌‌పురా, పస్రూర్, సియాల్‌‌‌‌‌‌‌‌కోట్ లో వర్షాల కారణంగా కరెంట్ షాక్​కు గురై ఏడుగురు చనిపోయారు. మృతుల్లో ఒక పోలీసు కూడా ఉన్నాడు. మొత్తం 10 మంది గాయపడ్డారు. వారిని ట్రీట్​మెంట్​ కోసం లోకల్ హాస్పిటల్​కు తరలించారు.