నిమజ్జనానికి వెళ్తూ కూలిన 20 అడుగుల గణేశ్ విగ్రహం

నిమజ్జనానికి వెళ్తూ కూలిన 20 అడుగుల గణేశ్ విగ్రహం

గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షానికి తెల్లవారుజామున తడిసిన గణేష్ విగ్రహం ఒకసారిగా కుప్పకూలింది. ఈ ఘటన హిమాయత్ నగరలో జరిగింది. కర్మన్ ఘాట్ కు చెందిన నవజీవన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. భారీ వర్షానికి గణేశ్ విగ్రహం పూర్తిగా తడిసిపోయింది. దీంతో మార్గమధ్యంలోనే కూలిపోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు క్రేన్ సహాయంతో విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు.