ఘోరం.. ఆక్సిజన్ అందక 20 మంది మృతి

ఘోరం.. ఆక్సిజన్ అందక 20 మంది మృతి

దేశ వ్యాప్తంగా హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత వేధిస్తుంది. కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత వల్ల 20 మంది పేషెంట్లు మృతి చెందారు. తమ దగ్గర మరో 30 నిముషాలకు మాత్రమే  సరిపడ ఆక్సిజన్ ఉన్నట్లు ఆస్పత్రి యజమాన్యం తెలిపారు. హాస్పిటల్ లో ఇంకా 200 మంది ఆక్సిజన్ బెడ్స్ పై చికిత్స అందిస్తున్నామన్నారు. లేటైతే వారు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. తమకు  ప్రభుత్వం నుండి 3.5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు  రావాల్సి ఉండే..కానీ అర్ధరాత్రి దాటింది. దీంతో  అప్పటికే 20 మంది రోగులు మరణించారని జైపూర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ డికె బలూజా చెప్పారు.