ఉమ్మడి వరంగల్‌‌లో నోటాకు 21 వేల ఓట్లు

ఉమ్మడి వరంగల్‌‌లో నోటాకు 21 వేల ఓట్లు

హనుమకొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో 21,174 మంది నోటాకు ఓటేశారు. వర్ధన్నపేటలో 3,612 , పాలకుర్తిలో 2,743, వరంగల్​ వెస్ట్​ లో 2,426 ఓట్లు నోటాకు పడ్డాయి. నర్సంపేట నియోజకవర్గంలో  738  ఓట్లు , భూపాలపల్లిలో 830, పరకాలలో 966, స్టేషన్​ ఘన్​ పూర్​ లో 1,153, డోర్నకల్​ లో 1,392, జనగామలో 1,467 ఓట్లు నోటాకు పోలయ్యాయి. వీటితో పాటు మహబూబాబాద్ లో 1,932, ములుగులో 1,937, వరంగల్ ఈస్ట్​ లో 1,978 నోటాకు వేయడం విశేషం.