
ఢిల్లీ మర్కజ్ వ్యవహారంతోనే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు తెలిపింది కేంద్రం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2301కు చేరిందని శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 56 మంది మృతి చెందగా.. 56 మరణాల్లో 12 మంది గురువారం చనిపోయారన్నారు. వ్యాధి నుంచి 157 మంది పేషెంట్లు కోలుకున్నారని చెప్పారు.
మొత్తం పాజిటివ్ కేసుల్లో 640 మంది తబ్లీగీ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్నవారేనని తెలిపారు. అత్యధికంగా 24 గంటల్లో 8వేల మంది శాంపిల్స్ టెస్టు చేయగా.. తబ్లీగీ జమాత్ ద్వారా గత రెండు రోజుల్లో 647 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ 647 పాజిటివ్ కేసులు 14 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని చెప్పారు లవ్ అగర్వాల్.