ఏపీలో గడచిన 24 గంటల్లో 2,367 కరోనా కేసులు

ఏపీలో గడచిన 24 గంటల్లో 2,367 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో మరో 2,367 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 80 వేల 82 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2వేల 367 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గడచిని 24 గంటల్లో కరోనా పాజిటివ్ సోకిన వారిలో  11 మంది మృతి చెందారు కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, విశాఖపట్టణం జిల్లాల్లో ఒకరొకరు చొప్పున కరోనా పాజిటివ్ బాధితులు కన్నుమూశారు. మరో వైపు గడచిన 24 గంటల్లో 2 వేల 747 మంది కరోనా నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.  ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 85 లక్షల 87 వేల 312 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది.