మునుగోడు బైపోల్‌లో ఉ.11గంటల వరకు 25.8శాతం పోలింగ్

మునుగోడు బైపోల్‌లో ఉ.11గంటల వరకు 25.8శాతం పోలింగ్

మునుగోడు బైపోల్ లో ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. మునుగోడులో ఉదయం 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు చేరుకుంటున్నారు. మునుగోడులో ఉన్న నాన్ లోకల్స్ ఆరుగురిపై కేసు నమోదైందని సీఈవో వికాస్ రాజ్ చెప్పారు. సీఈవో కార్యాలయానికి 60కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రలోభాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 1442 కి కాల్ చేయాలని అధికారులు తెలిపారు.

 అటు చండూరు మండలం ఇడికూడలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు వేశారు. నారాయణపురం మండలం లింగవారి గూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దంపతులు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు మునుగోడు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు.