హైదరాబాద్, వెలుగు: టీడీపీ రాష్ట్ర కమిటీని విస్తరించి మరో 28 మం దికి కార్యవర్గంలో చోటు కల్పిం చారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. తాజా నియామకాలతో రాష్ట్ర కార్యవర్గం సభ్యుల సంఖ్య 61కి చేరింది.
ఈ జాబితాలో ఒకరిని ఉపాధ్యక్షునిగా, ముగ్గు రిని ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. అదేవిధంగా ఐదుగురిని అధికార ప్రతినిధు లుగా, మరో ఎనిమిది మందిని కార్యనిర్వాహక కార్యదర్శులుగా, పదకొండు మందిని కార్యదర్శు లుగా నియమించారు.
కాగా, సీనియారిటీ, పనితీరును దృష్టిలో ఉంచుకొని మహానాడు అనం తరం మరో విడత రాష్ట్ర కార్య వర్గాన్ని విస్తరిస్తామని కాసాని తెలిపారు. అనుబంధ విభాగాల పదవులలో పలువురిని నియ మిస్తామని ఆయన వెల్లడించారు.