షాపు తాళాలు పగలగొట్టి 285 మద్యం సీసాలు చోరీ

షాపు తాళాలు పగలగొట్టి 285 మద్యం సీసాలు చోరీ

లాక్ డౌన్ వేళ మ‌ద్యం దుకాణాలన్ని మూత‌ప‌డ్డాయి. అయితే దీన్ని ఆస‌రాగా చేసుకొని షాపు తాళాలు ప‌గ‌ల‌గొట్టి మద్యం సీసాలు దొంగిలించారు కొంద‌రు దుండ‌గ‌లు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల గ్రామం శివారులో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. మద్యం షాపు తాళాలు పగలగొట్టి 285 మద్యం సీసాలు దొంగిలించారు. వీటి విలువ రూ.2,11,000 ఉంటుందని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ మేనేజర్ పాండురంగారావు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ సంఘటనా స్థలంలో నైట్ గార్డ్ నిర్లక్ష్యం వల్ల ఈ చోరీ జరిగిందని అన్నారు. ఈ దొంగతనానికి పాల్పడిన వారు ఇంటి దొంగలా? లేక బయట దొంగల పనా? అని పోలీసు విచారణలో తేలుతుందని తెలిపారు. ఘటనా స్థలానికి భీమడోలు ఎక్సైజ్, ద్వారకా తిరుమల పోలీసులు చేరుకుని ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.