ఆదర్శంగా నిలిచారు : ఓటేసిన శతాధిక వృద్ధురాళ్లు

ఆదర్శంగా నిలిచారు : ఓటేసిన శతాధిక వృద్ధురాళ్లు

నందిగామ : రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఇద్దరు వృద్ధురాళ్లు అందరికంటే ముందు ఓటేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఒకరి వయసు 105, మరొకరి వయసు 110. సరిగ్గా నడవలేని వయసులోనూ ఈ ఇద్దరు ముసలవ్వలు  పొద్దుగాల 7 గంటలకే పోలింగ్ సెంటర్ చేరుకున్నారు. వీరు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డి గూడెం గ్రామంలో ఓటు వేశారు. శతాధిక వృద్ధురాళ్లు మంగలి సంగమ్మ వయసు 110 సంవత్సరాలు కాగా, మంగలి జంగమ్మ వయసు 105 సంవత్సరాలు.. వీరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.  ఓటు హక్కును వినియోగించుకోనివారు ఈ ముసలవ్వలను చూసైనా ఓటు వేయాలని కోరుకుంటున్నారు.