సోషల్ మీడియాలో మోడీ ఫాలోవర్స్ పెరిగారు

సోషల్ మీడియాలో మోడీ ఫాలోవర్స్ పెరిగారు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలో 3 కోట్ల ఫాలోవర్ల మార్క్‌‌ను దాటిన నేతగా రికార్డుకెక్కారు. ప్రస్తుతం అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు 2.4 కోట్ల మంది, అధ్యక్షుడు డొనాల్డ్‌‌ ట్రంప్‌‌ 1.4 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్విట్టర్‌‌లోనూ మోడీనే టాప్‌‌లో ఉన్నారు. అందులో 5 కోట్ల మంది ప్రధానిని అనుసరిస్తున్నారు.

ఫేస్‌‌బుక్‌‌లో 4.4 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. ఈ ఏడాది మేలో వంద కోట్ల మంది యూజర్ల మార్క్‌‌ను చేరుకున్న ఇన్‌‌స్టాగ్రామ్‌‌.. ఇండియాలో 3.9 కోట్ల మంది ఫాలోవర్లతో ప్రియాంక చోప్రా టాప్‌‌లో ఉన్నారని చెప్పింది.