ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పొదిలి మండలం తలమళ్ల దగ్గర బైక్ , కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. ఒంగోలు నుంచి పొదిలి వస్తున్న బైక్ ను వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ముగ్గురు మృతి చెందారు. వీరు కనిగిరి మండలానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
see more news