ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. షోఫియాన్ లో జరుగుతున్న ఎన్ కౌంటర్ లో ఇప్పటివరకూ లష్కర్ ఏ తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రత బలగాలు కాల్చి చంపాయి. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. షోఫియాన్ జిల్లా బుద్గామ్ లో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో కశ్మీర్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే టెర్రరిస్టులకు పోలీసులకు, మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు బుద్గాంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆఫీసర్ తీవ్రంగా గాయపడ్డాడు.