షోపియాన్: ముగ్గురు మిలిటెంట్లను భద్రతా దళాలు మట్టుబెట్టిన ఘటన జమ్మూ కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో గురువారం జరిగింది. కనిగం అనే ప్రాంతంలో ముష్కరులు దాగి ఉన్నారన్న సమాచారం అందడంతో సెక్యూరిటీ ఫోర్సెస్ కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. దీంతో అక్కడ దాగి ఉన్న మిలిటెంట్లు కాల్పులకు దిగారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మిలిటెంట్లు మృతి చెందారని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఎన్కౌంటర్ సమయంలో ఓ మిలిటెంట్లలోని ఒకరు పోలీసులకు లొంగిపోయాడు. అతడ్ని తౌసిఫ్ అహ్మద్గా గుర్తించారు.
Surrendered #terrorist Tausif #appeals to other three trapped terrorists to #surrender.@JmuKmrPolice pic.twitter.com/AJFWMV1zMJ
— Kashmir Zone Police (@KashmirPolice) May 6, 2021