శ్రీనగర్ దాల్లేక్లో అగ్ని ప్రమాదం..ముగ్గురు టూరిస్టులు సజీవ దహనం

శ్రీనగర్ దాల్లేక్లో  అగ్ని ప్రమాదం..ముగ్గురు టూరిస్టులు సజీవ దహనం

శ్రీనగర్ లోని దాల్ సరస్సులో హౌజ్ బోట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు టూరిస్టులు సజీవ దహనమయ్యారు. తెల్లవారు జామున జరిగిన అగ్నిప్రమాదంలో సరస్సులోని చాలా బోట్లు కాలిపోయి బూడిదయ్యాయి. కొన్ని గంటల తర్వాత మృతదేహాలు కనిపించాయని అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదంలో ధ్వంసమైన సఫీనా హౌజ్ బోట్ లో బంగ్లాదేశ్ కు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతిచెందారు. 

దాల్ సరస్సులోని ఘాట్ నెం 9 సమీపంలో ని హౌజ్ బోట్ లో మంటలు చెలరేగాయి. అవి త్వరగా వ్యాపించి ఇతర బోట్లకు కూడా చుట్టుముట్టడంతో ప్రమాదం తీవ్రత పెరిగిందని శ్రీనగర్ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కనీసం అయిదు బోట్ హౌజ్ లు పూర్తిగా కాలిపోయాయని.. మరొకొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.