వికారాబాద్ లో బస్సు ప్రమాదం..30 మందికి గాయాలు

వికారాబాద్ లో బస్సు ప్రమాదం..30 మందికి గాయాలు

వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. మర్పల్లి మండలం కల్ఖోడా దగ్గర బస్సు  అదుపు తప్పి బోల్తా కొట్టింది. సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు తాండూర్ కి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరిక పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని మర్పల్లి ఆస్సత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమంటున్నారు ప్రయాణికులు. ప్రమాదం జరిగిన సమయంలో  బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులున్నారు.