నవంబర్ 30న అన్ని సంస్థలకు సెలవు

నవంబర్ 30న అన్ని సంస్థలకు సెలవు

హైదరాబాద్, వెలుగు :  పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 30న అన్ని సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులు ఆ రోజున ఓటు హక్కును వినియోగించుకునేలా సెలవు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. సెలవు ప్రకటించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

2018 అసెంబ్లీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ సారి అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బుధవారం, గురువారం రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.