రామ్ లల్లా దర్శనం చేసుకునేందుకు మొత్తం 350 మంది ముస్లిం భక్తులు ఆరు రోజుల పాదయాత్ర చేసి అయోధ్య చేరుకున్నారు. ముస్లిం రాష్ట్రీయ మంచ్ (MRM) ఆధ్వర్యంలోని ఆర్ఎస్ఎస్ మద్దతు గల సంస్థ జనవరి 25న లక్నో నుండి తమ ప్రయాణాన్ని ప్రారంభించిందని MRM మీడియా ఇన్ఛార్జ్ షాహిద్ సయీద్ అన్నారు. అయోధ్య నుండి లక్నో వరకు 6-రోజుల ప్రయాణం 'జై శ్రీరామ్' నినాదాల మధ్య, 350 మంది ముస్లిం భక్తుల బృందం దట్టమైన పొగమంచు, తీవ్రమైన చలి మధ్య కాలినడకన సుమారు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత అయోధ్యకు చేరుకుంది. ప్రతి 25 కిలోమీటర్లకు ఆగి, మరుసటి రోజు ఉదయం తమ ప్రయాణాన్ని కొనసాగించారు.
ఆరు రోజుల పాద యాత్ర అనంతరం, అరిగిపోయిన బూట్లు, అలసిపోయిన శరీరంతో భక్తులు అయోధ్యకు చేరుకుని కొత్తగా ప్రతిష్టించిన రామ్ లల్లా మందిరాన్ని సందర్శించారు. మత సామరస్యాన్ని ప్రోత్సహిస్తున్న సంఘటన "ఇమామ్-ఎ-హింద్ రామ్ యొక్క ఈ గౌరవప్రదమైన దర్శనాన్ని భక్తులు ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకంగా భావించారు" అని సయీద్ పేర్కొన్నారు. అలాగే ముస్లిం భక్తుల ఈ చర్య ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం, సామరస్యం యొక్క సందేశాన్ని అందించిందని ఆయన అన్నారు. దర్శనం తరువాత, ప్రావిన్షియల్ కోఆర్డినేటర్ షేర్ అలీ ఖాన్, MRM కన్వీనర్ రాజా రయీస్ నేతృత్వంలోని బృందం, రాముడు అందరికీ చెందిన వాడని పేర్కొన్నారు. తోటి మానవుల పట్ల ప్రేమగా వ్యవహరించాలి. ‘భగవాన్ శ్రీ రాముడు పూర్వీకుడు అని.. కులం, మతం కన్నా దేశం కోసం ప్రేమ, మానవత్వం ఎక్కువ. ఏ మతం ఇతరులను విమర్శించడం, ఎగతాళి చేయడం వంటివి ప్రోత్సహించదని ఎంఆర్ఎం కన్వీనర్ రాజా రయీస్ తెలిపారు
-Change has begun in ??-
— केकेमोहम्मद: - commentary (@kkmuhammedk) January 31, 2024
350 Muslims (my kind of Muslims) undertake 6 day Pad Yatra to offer prayers at Ram Mandir Ayodhya.
They covered approximately 150 km on foot between Lucknow & Ayodhya.
Raja Raees, speaking after darshan of Ramlalla, said Lord Ram is the ancestor of all pic.twitter.com/3t1RnY8nwd