ఏపీలో కొత్తగా 3620 కరోనా కేసులు.. 16 మంది మృతి

ఏపీలో కొత్తగా 3620 కరోనా కేసులు.. 16 మంది మృతి

ఏపీలో కొత్తగా మరో 3620 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 76,726 టెస్టులు చేయగా ఈ కేసులు వచ్చాయి. బుధవారం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా సంఖ్య 7,96,919కి చేరింది. అందులో 7,58,138 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,723 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటి వరకు 6,524 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 16 మంది మరణించారు. రాష్ట్రంలో రోజు రోజుకీ యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ వ్యాప్తి కూడా కంట్రోల్‌లోకి వచ్చిందని, మరణాల రేటు తగ్గి, రికవరీ రేటు బాగా పెరుగుతోందని పేర్కొంది. ఇప్పటి వరకు 7,58,138 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 32,257గా ఉందని తెలిపింది.