
- ఈసారి 40 లక్షల బండ్ల అమ్మకం
- ఎస్యూవీలకు డిమాండ్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీగా సంపాదించబోతున్నాయి. ఎందుకంటే ఈసారి 40 లక్షలకుపైగా వెహికల్స్ అమ్ముడవుతాయని అంచనాలు ఉన్నాయి. వీటిలో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) వాటా దాదాపు సగం ఉంటుందని ఆటోరంగ నిపుణులు చెబుతున్నారు. ఒక దశాబ్దం క్రితం 25 లక్షల యూనిట్లుగా ఉన్న ప్యాసింజర్ వెహికల్స్అమ్మకాలు, కరోనా కాలంలో తగ్గినా తిరిగి పుంజుకున్నాయి. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 38 లక్షల బండ్లు అమ్ముడయ్యాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెంబర్ 41 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. వీటిలో ఎస్యూవీలు దాదాపు 19 లక్షలు ఉంటాయని అంచనా. పదేళ్ల క్రితం క్రితం కేవలం 3,63,000 ఎస్యూవీలే అమ్ముడయ్యాయి.
Also Raed :- సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ స్పెషల్ సెషన్..
సేల్స్ మిక్స్లో హ్యాచ్బ్యాక్లు, సెడాన్ల వాటా పదేళ్ల క్రితం 71 శాతం ఉండగా, తాజాగా 40 శాతానికి పడిపోయాయి. ఎస్యూవీలు కార్ల కంపెనీలకు బలమైన మద్దతును ఇస్తున్నాయి. తమ మొత్తం అమ్మకాలలో దాదాపు 46–-47 శాతం వరకు ఎస్యూవీలే ఉన్నాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ తెలిపారు.
కస్టమర్ల చాయిస్లు...మారుతున్నయ్
ఎస్యూవీలు పెరగడం వల్ల దశాబ్దం క్రితం 107 గా ఉన్న ప్యాసింజర్ కార్ల మోడళ్ల సంఖ్య ప్రస్తుతం 87 కి పడిపోయింది. మారుతీ సుజుకీ మార్కెట్ వాటా గత 10 ఏళ్ల నుంచి 42 శాతం కంటే ఎక్కువ ఉందని, ఎస్యూవీలు ఇప్పుడు అమ్మకాలకు గణనీయంగా దోహదపడుతున్నాయని సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. చిన్న కార్ల అమ్మకాలూ పడిపోతున్నాయి. ఎక్కువ మంది పెట్రోల్ బండ్లను, ఎస్యూవీలను కోరుకుంటున్నారు. పరిశ్రమ నిపుణుల అంచనాల ప్రకారం ఆటోమొబైల్మార్కెట్ వాటా 2014 ఆర్థిక సంవత్సరంలో 41శాతం నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో 66శాతానికి చేరుతుందని భావిస్తున్నారు. ఇదే కాలంలో డీజిల్ బండ్ల డిమాండ్ 51శాతం నుంచి 18శాతానికి తగ్గుతుందని అంచనా. సీఎన్జీలు, ఈవీలవైపు చూసే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. ఎస్యూవీలతో పాటు ఎంపీవీలకూ ఆదరణ దక్కుతోంది.