రికార్డ్​ సేల్స్..ఏడాదిలోనే 38 లక్షల బండ్ల అమ్మకం

రికార్డ్​ సేల్స్..ఏడాదిలోనే 38 లక్షల బండ్ల అమ్మకం
  • ఈసారి 40 లక్షల బండ్ల అమ్మకం
  • ఎస్​యూవీలకు డిమాండ్​

న్యూఢిల్లీ: ఆటోమొబైల్​ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీగా సంపాదించబోతున్నాయి. ఎందుకంటే  ఈసారి 40 లక్షలకుపైగా వెహికల్స్​ అమ్ముడవుతాయని అంచనాలు ఉన్నాయి. వీటిలో  స్పోర్ట్  యుటిలిటీ  వెహికల్స్ (ఎస్​యూవీ) వాటా దాదాపు సగం ఉంటుందని ఆటోరంగ నిపుణులు చెబుతున్నారు. ఒక దశాబ్దం క్రితం 25  లక్షల యూనిట్లుగా ఉన్న ప్యాసింజర్ వెహికల్స్​అమ్మకాలు, కరోనా కాలంలో తగ్గినా తిరిగి పుంజుకున్నాయి. పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 38 లక్షల బండ్లు అమ్ముడయ్యాయి.  

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెంబర్ 41 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. వీటిలో ఎస్​యూవీలు దాదాపు 19 లక్షలు ఉంటాయని అంచనా.  పదేళ్ల  క్రితం క్రితం కేవలం 3,63,000 ఎస్​యూవీలే అమ్ముడయ్యాయి.

Also Raed :- సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ స్పెషల్ సెషన్..

సేల్స్ మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హ్యాచ్‌‌‌‌‌‌‌‌బ్యాక్‌‌‌‌‌‌‌‌లు,  సెడాన్‌‌‌‌‌‌‌‌ల వాటా పదేళ్ల క్రితం 71 శాతం  ఉండగా, తాజాగా 40 శాతానికి పడిపోయాయి. ఎస్​యూవీలు కార్ల కంపెనీలకు బలమైన మద్దతును ఇస్తున్నాయి. తమ మొత్తం అమ్మకాలలో దాదాపు 46–-47 శాతం వరకు ఎస్​యూవీలే ఉన్నాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ తెలిపారు. 

కస్టమర్ల చాయిస్​లు...మారుతున్నయ్​ 

ఎస్​యూవీలు పెరగడం వల్ల దశాబ్దం క్రితం 107 గా ఉన్న ప్యాసింజర్ కార్ల మోడళ్ల సంఖ్య ప్రస్తుతం 87 కి పడిపోయింది. మారుతీ సుజుకీ   మార్కెట్ వాటా  గత 10  ఏళ్ల నుంచి  42 శాతం కంటే ఎక్కువ ఉందని, ఎస్​యూవీలు ఇప్పుడు అమ్మకాలకు గణనీయంగా దోహదపడుతున్నాయని సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.  చిన్న కార్ల అమ్మకాలూ పడిపోతున్నాయి. ఎక్కువ మంది పెట్రోల్​ బండ్లను, ఎస్​యూవీలను కోరుకుంటున్నారు. పరిశ్రమ నిపుణుల అంచనాల ప్రకారం ఆటోమొబైల్​మార్కెట్ వాటా 2014 ఆర్థిక సంవత్సరంలో 41శాతం నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో 66శాతానికి చేరుతుందని భావిస్తున్నారు. ఇదే కాలంలో డీజిల్ బండ్ల డిమాండ్ 51శాతం నుంచి 18శాతానికి తగ్గుతుందని అంచనా. సీఎన్​జీలు, ఈవీలవైపు చూసే వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. ఎస్​యూవీలతో పాటు ఎంపీవీలకూ ఆదరణ దక్కుతోంది.