సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదం : నలుగురు విద్యార్థులు మృతి

సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదం : నలుగురు విద్యార్థులు మృతి

తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా ఊత్తంగరైలో విషాదం జరిగింది. సెల్ఫీ తీసుకోబోతూ జలాశయంలో పడి నలుగురు విద్యార్థులు చనిపోయారు. పాంబారు జలాశయం దగ్గరకు విహార యాత్రకు వెళ్లారు నలుగురు విద్యార్థులు. జలాశయం సెల్ఫీ తీసుకోబోతుండగా అదుపుతప్పి గట్టుపై నుంచి నీటిలో పడిపోయారు.

స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి నలుగురి మృతదేహాలను బయటికి తీశారు.