అంబర్పేట్, వెలుగు: స్పెషల్ టాస్క్ఫోర్స్, కాచిగూడ ఎక్సైజ్ పోలీసులు కలిసి శుక్రవారం 4.62 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ ఫైజల్, అన్షు ప్రసాద్, మహమ్మద్ అలీ, అండువల్లి ప్రీతి వర్ధన్ స్టూడెంట్స్..శుక్రవారం అంబర్పేట్లోని రాధా నిలయం వద్ద రోడ్డుపై కారు, టూ వీలర్పై అనుమాదాస్పదంగా తిరుగుతూ కనిపించారు. ఆపి తనిఖీ చేయగా 4.62 గ్రాములు ఎండీఎంఏ దొరికింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్శ్రీధర్తెలిపారు.
