హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల స్థానాలకు 41 నామినేషన్లు దాఖలు

హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల స్థానాలకు 41 నామినేషన్లు దాఖలు

హైదరాబాద్/ఎల్బీనగర్, వెలుగు: హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల ఎంపీ స్థానాలకు మంగళవారం 41 నామినేషన్లు అందాయి. ఇందులో హైదరాబాద్ స్థానానికి 11 మంది నుంచి 13 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 24 మంది నామినేషన్​వేశారని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ స్థానానికి మంగళవారం 11 మంది నుంచి 14 సెట్ల  నామినేషన్లు వచ్చాయని, ఇప్పటివరకు మొత్తం 33 మంది నామినేషన్లు వేశారని వెల్లడించారు. 

చేవెళ్ల స్థానానికి మంగళవారం 14 నామినేషన్లు వచ్చాయని రిటర్నింగ్ ఆఫీసర్ శశాంక తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ రెండు సెట్లు, కాంగ్రెస్​అభ్యర్థి ఒక సెట్​దాఖలు చేశారని చెప్పారు. ఇప్పటివరకు మొత్తం 37 నామినేషన్లు అందాయని వెల్లడించారు. అలాగే సికింద్రాబాద్​కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మంగళవారం ముగ్గురు 3 సెట్ల నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు మొతం 13 మంది నుంచి నామినేషన్లు అందాయి.