ఒకేరోజు.. ఒకే ఫ్యామిలీలో 42 మంది మృతి

ఒకేరోజు.. ఒకే ఫ్యామిలీలో 42 మంది మృతి

గాజా: గాజాసిటీపై ఇజ్రాయెల్ జరిపిన బాంబుదాడుల్లో ఒకేరోజున ఒకే ఫ్యామిలీకి చెందిన 42 మంది మృతిచెందారు. అక్టోబర్ 19న జరిగిన దాడుల్లో తాము ఇంత మంది బంధువులను కోల్పోయామంటూ మృతుల బంధువులు తారిక్ హమౌదా వెల్లడించారు. ఒకేరోజు మూడు తరాలకు చెందిన వారంతా చనిపోయారని మీడియా ముందు విలపించారు. తమ బంధువులు చనిపోవడంతో తన భార్య షాక్ లోకి వెళ్లిందని, వారి మరణం విషయాన్ని ఇప్పటికీ నమ్మటంలేదన్నారు.

కాగా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 8,525కు పెరిగిందని గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. గాజాలో 21 వేల మంది గాయపడ్డారని తెలిపింది.  ఇక హమాస్ దాడుల వల్ల ఇజ్రాయెల్ లో 1,400 మంది చనిపోయారు. మరోవైపు, యుద్ధంలో చనిపోయిన ఇజ్రాయెల్ సోల్జర్ల సంఖ్య 326కు పెరిగింది. ఇందులో భారత సంతతికి చెందిన సైనికుడు స్టాఫ్ సార్జెంట్ హలేల్ సోలోమాన్ కూడా ఉన్నారని అధికారులు తెలిపారు.