రాముడి గుడి నిర్మాణంలో45 కిలోల ప్యూర్ గోల్డ్

రాముడి గుడి నిర్మాణంలో45 కిలోల ప్యూర్ గోల్డ్
  • రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడి

లక్నో: అయోధ్య రామాలయ నిర్మాణంలో 45 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని ఉపయోగించినట్లు ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా శుక్రవారం వెల్లడించారు. దాదాపు రూ.50 కోట్ల విలువైన ఈ బంగారాన్ని ప్రధానంగా గ్రౌండ్ ఫ్లోర్‌‌‌‌లోని ఆలయ తలుపులలో, రాముడి సింహాసనంలో వాడినట్లు తెలిపారు. కాంప్లెక్స్ లోపల ఉన్న శేషావతార్ ఆలయంలో ఇంకా బంగారు పనులు కొనసాగుతున్నాయని వివరించారు. 

ప్రధాన రామాలయ నిర్మాణం పూర్తయినప్పటికీ మ్యూజియం, ఆడిటోరియం, గెస్ట్ హౌస్ సహా కాంప్లెక్స్‌‌‌‌లోని ఇతర భాగాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇవి డిసెంబర్ 2025 నాటికి పూర్తవుతాయని చెప్పారు. గురువారం రామ దర్బార్ సహా ఉపాలయాల్లో ఏడు విగ్రహాల ప్రతిష్ఠాపన వేడుక జరిగిందన్నారు.

 గర్భగుడి మొదటి అంతస్తులో రామ దర్బార్, శివలింగం, గణపతి, హనుమాన్, సూర్యుడు, భగవతి, అన్నపూర్ణ విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు వివరించారు.