లాసెట్​కు 45,609 మంది హాజరు..10న వెబ్ సైట్​లో ప్రిలిమినరీ కీ

లాసెట్​కు 45,609 మంది హాజరు..10న వెబ్ సైట్​లో ప్రిలిమినరీ కీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లా కోర్సుల్లో ప్రవేశాల కోసం శుక్రవారం నిర్వహించిన టీజీ లాసెట్, టీజీఎల్​ సెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 57,715 మంది రిజిస్ర్టేషన్ చేసుకోగా.. 45,609 (79.02%) మంది ఎగ్జామ్ కు అటెండ్ అయ్యారు. ఉస్మానియా వర్సిటీలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్లు ఇటిక్యాల పురుషోత్తం, మహమూద్, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, కన్వీనర్ విజయలక్ష్మీ, జీబీరెడ్డి తదితరులు ఎగ్జామ్ సెట్స్ ఎంపిక చేశారు. 

మూడు సెషన్లలో జరిగిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని వారు చెప్పారు. మూడేండ్ల ఎల్ఎల్​బీ కోర్సు కోసం జరిగిన పరీక్షకు 26,718 మంది అటెండ్ అయ్యారు. ఐదేండ్ల ఎల్ఎల్​బీ, రెండేండ్ల ఎల్ఎల్ఎం కోర్సు కోసం 13,491 మంది హాజరయ్యారు. ఈ నెల 10న ప్రిలిమినరీ కీ ని రిలీజ్ చేయనున్నారు.