మంత్రి తలసాని ముందు ఓ వృద్ధురాలి ఆవేదన
హైదరాబాద్, (పద్మారావు నగర్), వెలుగు: తన 45 గజాల ఇంటికి జీహెచ్ఎంసీ ఆఫీసర్లు రూ. 50వేల ప్రాపర్టీ ట్యాక్స్ వేశారని అంటూ ఓ వృద్ధురాలు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను కలిసి మొరపెట్టుకున్నారు. బుధవారం వరద సాయం అందించడానికి మోండా మార్కెట్నాలాబజార్కు మంత్రి వెళ్లగా.. వృద్ధురాలు సమస్యను వివరించారు. మంత్రి తలసాని స్పందించి అధికారుల వద్ద ఆరా తీశారు. ఆ ప్రాపర్టీ ట్యాక్స్ విషయం చూడాలని జీహెచ్ఎంసీ ఆఫీసర్లను మంత్రి ఆదేశించారు.