45 గజాల ఇంటికి రూ. 50 వేల ట్యాక్సా?

45 గజాల ఇంటికి రూ. 50 వేల ట్యాక్సా?

మంత్రి తలసాని ముందు ఓ వృద్ధురాలి ఆవేదన

హైదరాబాద్, (పద్మారావు నగర్​), వెలుగు: తన 45 గజాల ఇంటికి జీహెచ్​ఎంసీ ఆఫీసర్లు రూ.  50వేల ప్రాపర్టీ ట్యాక్స్​  వేశారని అంటూ ఓ వృద్ధురాలు మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ను కలిసి మొరపెట్టుకున్నారు. బుధవారం వరద సాయం అందించడానికి మోండా మార్కెట్​నాలాబజార్​కు మంత్రి వెళ్లగా.. వృద్ధురాలు సమస్యను వివరించారు. మంత్రి తలసాని స్పందించి అధికారుల వద్ద ఆరా తీశారు. ఆ  ప్రాపర్టీ ట్యాక్స్​ విషయం చూడాలని  జీహెచ్​ఎంసీ  ఆఫీసర్లను మంత్రి ఆదేశించారు.