రెండు బస్సులు ఢీ.. ఐదుగురు ప్రయాణికులు మృతి

రెండు బస్సులు ఢీ.. ఐదుగురు ప్రయాణికులు మృతి

హర్యానాలోని ఢిల్లీ-అంబాలా నేషనల్ హైవేపై రోడ్డుప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొట్టుకోవడంతో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.