తెలంగాణలో 5 కొత్త ఒమిక్రాన్ కేసులు

తెలంగాణలో 5 కొత్త ఒమిక్రాన్ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ మరో 5 కొత్త ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. మెల్లగా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. సామాజిక వ్యాప్తి మొదలైందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల నుండి వచ్చిన వారి నుండి ఎలాంటి కేసులు బయటపడకపోగా.. ఒమిక్రాన్  ప్రభావం లేని దేశాల నుండి వచ్చిన వారిలోనే కేసులు బయటపడుతున్నాయి. ఇవాళ తాజాగా వచ్చిన 5 కేసులతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84 కి చేరింది. మరో వైపు ఇప్పటికే 32 మంది కొలుకునట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదిలా ఉండగా ఇవాళ సాధారణ కరోనా కేసులు మొత్తం 274 నమోదు కాగా ఒకరు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.