స్వర్ణ ప్యాలెస్ ప్రమాద బాధితులకు 50 లక్షలు

స్వర్ణ ప్యాలెస్ ప్రమాద బాధితులకు 50 లక్షలు

చనిపోయిన పది మంది కుటుంబాలకు ఒక్కోక్కరికి రూ.50 లక్షల చొప్పున సాయం పంపిణీ

విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు యాభై లక్షల రూపాయలు చొప్పున  చెక్కులు అందచేశారు. మంత్రులు ఆళ్ల నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు,  మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, కలెక్టర్ ఇంతియాజ్ ల సమక్షంలో బాధితులకు ఆర్ధిక సహాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ఈనెల 9వ తేదీన రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో లో నడుస్తున్న స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో బాధ్యతా రాహిత్యం వల్ల అగ్నిప్రమాదం జరిగి పది మంది చనిపోగా, 20మంది గాయపడ్డారు.. ఇంటి పెద్దలు చనిపోడంతో… ఆదరణ లేకుండా పోయిన కుటుంబాలకు సిఎం జగన్ మానవత్వంతో మృతుల కుటుంబ సభ్యులకు యాభై లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు.. ఆయన హామీ మేరకు ఈరోజు ఒక్కొక్కరికీ యాభై లక్షల చొప్పున చెక్కులు అందచేస్తున్నామన్నారు.

విజయవాడలో ఆరుగురికి, మచిలీపట్నంలో ముగ్గురికి ఇచ్చాం..  కందుకూరులో భర్తను కోల్పోయిన నిండు గర్బిణిగా ఉన్న ఆమె ఇంటికి వెళ్ళి చెక్ అందిస్తారు.. ఈ ప్రమాద ఘటన తో ప్రైవేటు ఆస్పత్రులు తీరు మార్చుకోవాలి.. డబ్బే ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకుంటాం.. కోవిడ్ వైద్యానికి సంబంధించి రమేష్ ఆసుపత్రి కి అన్ని అనుమతులు రద్దు చేశాం.. ఆస్పత్రి పెద్దలు కోర్టు కు వెళ్లి ముందస్తు బెయిల్ పిటీషన్లు వేస్తున్నారు.. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా, అధిక ఫీజులు కూడా వసూలు చేసినట్లు విచారణలో తేలింది.. వారికి నోటీసులు కూడా ఇచ్చాం.. 30వ తేదీ తరువాత వారి జవాబును బట్టి ప్రభుత్వ నిర్ణయం ఉంటుందన్నారు. కోర్టు లో కేసు నడుస్తున్నందున,  ఆ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం, అన్ని ఆసుపత్రులను ఒకే గాటిన కట్టలేము.. అధిక ఫీజులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే విచారిస్తాం…  రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడి మరణిస్తున్నారు.. సమాచార శాఖ మంత్రి పేర్ని నాని కూడా సిఎం జగన్ దృష్టి కి తెచ్చారు.. అన్ని పరిశీలించి త్వరలోనే సాయం అందించేలా చూస్తాం అని చెప్పారు.