డ్రంక్ అండ్ డ్రైవ్లో 53 మందికి శిక్షలు

డ్రంక్ అండ్ డ్రైవ్లో 53 మందికి శిక్షలు

కామారెడ్డిటౌన్, వెలుగు : జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 53 మందికి కోర్టులు శిక్షలు విధించినట్లు ఎస్పీ రాజేశ్​చంద్ర గురువారం తెలిపారు. ఆరుగురికి ఒక రోజు జైలు శిక్ష, మరోకరికి  3 రోజుల జైలు శిక్ష పడిందన్నారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 14 మంది, దేవునిపల్లిలో 6, బిచ్​కుందలో 5,  బీబీపేటలో 1, రాజంపేట 2, దోమకొండ1, బాన్సువాడ5, బీర్కుర్​2,  నస్రుల్లాబాద్​ 6, నిజాంసాగర్​ 7,  పిట్లంలో 4 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

ధర్పల్లి పోలీస్​స్టేషన్​పరిధిలో..

నిజామాబాద్ : ధర్పల్లి పోలీస్ స్టేషన్​పరిధిలో గురువారం డ్రంక్​అండ్​డ్రైవ్​ నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడిపిన రాంపూర్​గ్రామానికి చెందిన ఒడ్డెన్నను అరెస్ట్​చేసి కోర్టులో హాజరుపర్చగా సెకండ్​క్లాస్​ మెజిస్ట్రేట్ 7 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై సామ శ్రీనివాస్​తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, బైక్​పై వెళ్లేవారు హెల్మెట్​, కారులో వెళ్లేవారు సీటు బెల్ట్​తప్పక ధరించాలని ఎస్సై సూచించారు.