పూణేకు విస్తరించిన బర్డ్ ఫ్లూ.. 5,557 కోళ్ల‌కు పాజిటివ్

పూణేకు విస్తరించిన బర్డ్ ఫ్లూ.. 5,557 కోళ్ల‌కు పాజిటివ్
మ‌హరాష్ట్ర‌తో పాటు పూణేలో కూడా బ‌ర్డ్ ఫ్లూ విస్త‌రిస్తోంది. ఆ రాష్ట్రంలోని ముల్షి, దౌండ్ జిల్లాల్లో ఫ్లూ ప్ర‌బలుతోంది. ఆ జిల్లాల్లో దాదాపు 5,557 కోళ్ల‌కు ఫ్లూ పాజిటివ్ అని తేల‌డంతో వాటిని చంపివేశారు. ముల్షి తాలూకాలోని నందే , దౌండ్ తాలూకాలోని బోరిబెల్ ను బ‌ర్డ్ ఫ్లూ సోకిన మండలాలుగా ప్రకటించారు జిల్లా కలెక్టర్ రాజేశ్ దేశ్‌ముఖ్. ఆ మండ‌లాల్లో కోళ్ల అమ్మకాలు, దిగుమ‌తుల‌పై 21 రోజుల పాటు నిషేధం విధించిన‌ట్టు తెలిపారు. అలాగే ఈ గ్రామాలకు 10 కిలోమీటర్ల చుట్టు ప్రక్కల ఉన్న అన్ని పౌల్ట్రీ స్థ‌లాల‌ను శుభ్రపరచాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై రాష్ట్రాలకు కేంద్రం అనేక సూచనలు జారీ చేసింది. ప్రజలలో అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు సమాచార మాథ్యమాలను ఉపయోగిస్తున్నాయి.