ఐదుగురు ఎయిర్‌‌ఇండియా పైలట్లకు కరోనా

ఐదుగురు ఎయిర్‌‌ఇండియా పైలట్లకు కరోనా
  • లక్షణాలు లేకుండానే పాజిటివ్‌

న్యూఢిల్లీ: ఎయిర్‌‌ఇండియాకు చెందిన ఐదుగురు పైలట్లకు కరోనా సోకిందని సమాచారం. ముంబయిలో ఉండే ఆ ఐదుగురు ఈ మధ్య చైనాలో వెళ్లి వచ్చిన కార్గో ఫ్లైట్స్‌లో డ్యూటీ చేసినట్లు సమాచారం. పరీక్షకు ముందు వారిలో ఎలాంటి కరోనా లక్షణాలు లేవని చెబుతున్నారు. ఎయిర్‌‌లైన్స్‌లో పనిచేస్తున్న 77 మంది పైలట్లకు టెస్టులు నిర్వహించగా.. వారిలో ఈ ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆ ఐదుగురు బోయింగ్‌ 787 డ్రీమ్‌లైనర్‌‌ను ఆపరేట్‌ చేస్తున్నారని అన్నారు. వాళ్లు చివరి సారి ఏప్రిల్‌ 20న ఫ్లైట్‌ను ఆపరేట్‌ చేశారని చెప్పారు. విదేశాల్లో చిక్కకున్న మన వాళ్లను ఇక్కడికి తీసుకొచ్చేందుకు అధికారులు ఎయిర్‌‌ ఇండియా ఫ్లైట్‌ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.