బాణసంచా పేలుడుకు ఆరుగురు బలి

బాణసంచా పేలుడుకు ఆరుగురు బలి

బిహార్లోని సారన్ జిల్లాలో బాణసంచా వ్యాపారి ఇంట్లో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఖుడాయి గ్రామంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పేలుడు ధాటికి ఇంటిలోని ఒక భాగం కుప్పకూలగా, మిగతా భాగానికి మంటలు అంటుకున్నాయి. 8 మంది ఇంటి శిథిలాల కింద  చిక్కుకోగా, స్థానికులు రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

గంటపాటు పేలుళ్ల శబ్దాలు

బాణసంచా వ్యాపారిని ఖుడాయి గ్రామానికి చెందిన షబ్బీర్ హుస్సేన్ గా గుర్తించారు. ఫోరెన్సిక్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దింపారు. దాదాపు గంటపాటు ఆ ఇంటి నుంచి పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని సారన్ ఎస్పీ సంతోష్ కుమార్ పరిశీలించారు. ఈ పేలుడు ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలని ఫోరెన్సిక్ విభాగానికి నిర్దేశించారు.