ఒక్క రోజులో 22,752 కేసులు.. 20,642కి చేరిన మృతుల సంఖ్య

ఒక్క రోజులో 22,752 కేసులు.. 20,642కి చేరిన మృతుల సంఖ్య
  • 7.4 లక్షలకు చేరిన కేసులు

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 22,752 కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం ఉదయానికి కేసుల సంఖ్య 7,2,417కి చేరింది. 482 మంది చనిపోవడంతో వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య 20,642కి చేరింది. ఇప్పటి వరకు 4,56,831 మంది వ్యాధి నుంచి రికవరి అయ్యారని, రికవరి రేటు 61.53శాతం ఉందని హెల్త్‌ మినిస్ట్రీ ప్రకటించింది. పాజిటివ్‌ టెస్టింగ్‌ రేట్‌ 8.66 శాతం ఉందని అన్నారు. కేసుల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు, ఢిల్లీ వాటి తర్వాత స్థానాల్లో నిలిచాయి. కాగా.. ప్రస్తుతం తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో కూడా పరిస్థితి దారుణంగా తయారయ్యే అవకాశాలు ఉన్నట్లు హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు.