
- 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్లో విలీనం
- లేదంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ పేరుతో నాలుగు కార్పొరేషన్లు
- ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖకు ప్రభుత్వం ఆదేశం
- సమాన జనాభా ఉండేలా డివిజన్ల పునర్విభజన
- పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాతే విలీన ప్రక్రియ
- గ్రేటర్ సిటీని సమాన రీతిలో అభివృద్ధి చేసేందుకు సర్కార్ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. హెచ్ఎండీఏ పరిధిలోని ప్రాంతాలన్నీ కలిపి ఒకే కార్పొరేషన్ లేదా నాలుగు దిక్కులా నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో పాటు మరో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు ఉండగా.. వీటన్నింటినీ కలిపి హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడమా?
లేదంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ పేరుతో నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమా? అనే దానిపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది. దీనిపై అధ్యయనం చేయాలని, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖ అధికారులకు ఇటీవల ఆదేశాలు అందినట్టు తెలిసింది. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు.
దాదాపు సమాన జనాభా ఉండేలా డివిజన్లు ఏర్పాటు చేయాలి. నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అందుకోసం ముందుగా పునర్విభజన ప్రక్రియపై అధ్యయనం చేయాలి. ఇప్పుడున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం పూర్తయిన వెంటనే వాటికి స్పెషలాఫీసర్లను నియమించాలి. అన్నింటి పదవీకాలం ముగిసిన తర్వాతే విలీన ప్రక్రియను ప్రారంభించాలి” అని ఇటీవల మున్సిపల్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో న్యాయపరమైన ఇబ్బందులేవీ తలెత్తకుండా ఉంటుందని యోచిస్తున్నారు.
ప్రస్తుతం ఒక్కో డివిజన్లో ఒక్కోలా జనాభా..
ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ పరిధిని విస్తరించాలని అధికారులను సీఎం రేవంత్ ఇటీవల ఆదేశించారు. అదే సమయంలో హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నింటినీ ఒక యూనిట్ గా లేదా నాలుగు యూనిట్లుగా విలీన ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు నిధుల పంపిణీలో అసమతుల్యత ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. అంతేకాకుండా గతంలో కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పుడు శాస్ర్తీయంగా చేయకపోవడం, ఒక్కో డివిజన్ లో ఒక్కో విధంగా జనాభా ఉన్నట్టు తెలుసుకుంది. కొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో లక్ష మందికి పైగా ఉండగా, మరికొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో కేవలం 30 వేల మంది మాత్రమే ఉన్నారు.
దీంతో సౌలతుల కల్పనకు కేటాయించే నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే... కొన్ని ప్రాంతాలకు లాభం జరిగి, మరికొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయి. మరోవైపు సిటీ విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వసతుల కల్పనకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే సిటీలో అభివృద్ధి చెందిన డివిజన్లలో తక్కువ నిధులు సరిపోతాయి. వీటన్నింటి దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ సిటీని ఒకేతీరుగా అభివృద్ధి చేసేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.
హెచ్ఎండీఏ పరిధి పెంపు..
హెచ్ఎండీఏ పరిధిని రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) వరకు విస్తరించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. ఇలా చేస్తే భవిష్యత్తులో నగరంపై ట్రాఫిక్ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 7,257 చదరపు కిలోమీటర్ల పరిధిలో హెచ్ఎండీఏ విస్తరించి ఉండగా, కొత్తగా ఏర్పడే ప్రాంతాలతో మరో 340 చదరపు కిలోమీటర్లు పెరుగుతుంది. హెచ్ఎండీఏ పరిధిని షాద్నగర్, చేవెళ్ల, తూప్రాన్, ములుగు, భువనగిరి, మల్కాపూర్, కొత్తూరు, నర్సాపూర్, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, శంకర్పల్లి, కంది, సంగారెడ్డి వరకు విస్తరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని స్టేట్, నేషనల్ హైవేలు హెచ్ఎండీఏ పరిధిలోని ప్రాంతాలతో అనుసంధానం కానున్నాయి. దీంతో అభివృద్ధి అన్నది ఒక క్రమపద్ధతిలో జరిగే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఢిల్లీ తరహాలో..
గతంలో ఢిల్లీలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా, వాటిని అక్కడి ప్రభుత్వం రెండేండ్ల కింద విలీనం చేసింది. వాటన్నింటినీ కలిపి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ విలీనం జరిగిన తీరు, అందుకు అనుసరించిన విధానాలను ఇటీవల మున్సిపల్ శాఖ అధికారులతో జరిగిన రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ పేట్, మీర్ పేట్ కార్పొరేషన్లు ఉన్నాయి. మరో 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. హెచ్ఎండీఏ పరిధిని యూనిట్ గా తీసుకుని హైదరాబాద్ గ్రేటర్ సిటీగా ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయడమా? లేదంటే సిటీ మొత్తాన్ని నాలుగు కార్పొరేషన్లుగా చేయడమా? అనేది పరిశీలించాలని అధికారులను రేవంత్ ఆదేశించారు.
ఢిల్లీ తరహాలో..
గతంలో ఢిల్లీలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా, వాటిని అక్కడి ప్రభుత్వం రెండేండ్ల కింద విలీనం చేసింది. వాటన్నింటినీ కలిపి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ విలీనం జరిగిన తీరు, అందుకు అనుసరించిన విధానాలను ఇటీవల మున్సిపల్ శాఖ అధికారులతో జరిగిన రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్లు ఉన్నాయి. మరో 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. హెచ్ఎండీఏ పరిధిని యూనిట్గా తీసుకుని హైదరాబాద్ గ్రేటర్ సిటీగా ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయడమా? లేదంటే సిటీ మొత్తాన్ని నాలుగు కార్పొరేషన్లుగా చేయడమా? అనేది పరిశీలించాలని అధికారులను రేవంత్ ఆదేశించారు.