V6 News

అనాథ, నిరుపేద స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు 70 శాతం సీట్లు

అనాథ, నిరుపేద స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు 70 శాతం సీట్లు

మెదక్​ టౌన్​, వెలుగు: డిప్లొమా కోర్సుల్లో అనాథ, నిరుపేద స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు 70 శాతం సీట్లు అందుబాటులో ఉన్నాయని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మెదక్​ కలెక్టర్ ప్రతిమాసింగ్​ సూచించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ హైదరాబాద్​ దుర్గాబాయి దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ (ఎస్​డీడీజీడబ్ల్యుటీటీఐ) యూసుఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్​ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్​ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (డిప్లొమా ఇన్​ డీసీఈ, డీసీఎస్​ఈ, డీఈసీఈ, డీఈఈఈ) విభాగాల్లో మూడేండ్ల ఫుల్-టైమ్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఇంటర్​ విద్యార్థులు అర్హులని తెలిపారు. sddgwtti.dte.telangana.gov.in.. వెబ్​సైట్​లో అప్లై చేసుకోవాలని సూచించారు.