777ఛార్లీ ట్రైలర్ వచ్చేసింది...

777ఛార్లీ ట్రైలర్ వచ్చేసింది...

కన్నడ ఫిల్మ్  ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లిన కేజీఎఫ్ సినిమా ఎంతో మంది మామూలు యాక్టర్స్ ని సైతం పాపులర్ స్టార్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వాళ్లలో ఒకరు రక్షిత్ శెట్టి. కిరిక్ పార్టీ సినిమాతో తన సత్తా చాటుకున్న  రక్షిత్ శెట్టి, అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో సినీ ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో 777 ఛార్లీ అనే చిత్రంతో  మరోసారి సినిమా అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. కిరణ్ రాజ్ దర్శకత్వంలో, రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా -జూన్ 10న పాన్ ఇండియా లెవ‌ల్లో తెలుగు, క‌న్నడ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌ కానుంది. కాగా దీనికి సంబంధించిన ట్రైల‌ర్‌ను తెలుగులో సోమ‌వారం వెంక‌టేష్‌,  సాయి ప‌ల్లవి, ల‌క్ష్మి మంచు విడుద‌ల చేశారు. సురేష్ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై రానా ద‌గ్గుబాటి స‌మ‌ర్పణ‌లో జి.ఎస్‌.గుప్తాతో క‌లిసి త‌న ప‌ర‌మ్ వ‌హ్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను నిర్మించారు. సంగీత శ్రింగేరి, రాజ్ బి.షెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. 

ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. హీరో రక్షిత్ శెట్టి, దర్శకుడు కిరణ్ రాజ్, రానా దగ్గుపాటిలను ట్యాగ్ చేస్తూ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ, 777 ఛార్లీ మూవీ ట్రైలర్ లింకును జత చేశారు.  అంతే కాకుండా పెట్ లవర్స్ కి టిష్యూస్ అవసరం ఉందంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అందర్నీ ఆకర్షిస్తోంది. మరి రక్షిత్ శెట్టికి ఈ మూవీ ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుందో చూడాలంటే విడుదల వరకూ వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకూ ఈ ట్రైలర్ చూసేయండి. 

 

https://youtu.be/DjNCn_B3fFg