
ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 8మంది మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు 30 గంటల నుంచి ఆపరేషన్ ప్రహార్ నిర్వహించారు. చత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలోని తొండమార్కా, దుర్మా, జడేకదేవాల్ అటవీప్రాంతంలో భద్రతాబలగాలు 30 గంటల పాటు ఆపరేషన్ ప్రహార్ నిర్వహించారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎదురు కాల్పులు జరిగిన స్థలం నుంచి మావోలకు చెందిన ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.